![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/cc-r-final.jpg?fit=1223%2C496&ssl=1)
సారథి న్యూస్, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చాప్టా(బీ) పంచాయతీలో సీసీరోడ్డు పనులను సర్పంచ్ సాయవ్వ మనోహర్, ఎంపీటీసీ ఇందుమతి మారుతీ శనివారం ప్రారంభించారు. రూ.ఐదులక్షల వ్యయంతో 170మీటర్లు రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు వారు తెలిపారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేస్తామన్నారు. బాలాజీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.