Breaking News

శ్రామిక్‌ రైళ్లను పంపకండి

  • కేంద్రాన్ని కోరిన పశ్చిమబెంగాల్‌ సర్కార్‌‌

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో ఎంఫాన్​ తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఈనెల 26 వరకు శ్రామిక్‌ రైళ్లను రాష్ట్రానికి పంపొద్దని సీఎం మమతా బెనర్జీ రైల్వే శాఖను కోరింది. ఈ మేరకు వెస్ట్‌ బెంగాల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజీవ్‌ సిన్హా రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌కు లెటర్‌‌ రాశారు. ‘జిల్లా అధికారులంతా రిలీఫ్‌, పునరావాస పనుల్లో ఉన్నారు. శ్రామిక్‌ రైళ్లలో వచ్చే వారిని పట్టించుకునే వీలు ఉండదు. అందుకే రైళ్లను నిలిపేయండి’ అని అన్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న కూలీలను తరలించేందుకు ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసింది. ఎంఫాన్‌ తుపాను పశ్చిమబెంగాల్‌లో బీభత్సం సృష్టించింది. తుఫాను ధాటికి 86 మంది చనిపోయారు. భారీ ఈదురుగాలులకు చెట్టు కూలిపోయాయి. భారీ ఆస్తినష్టం వాటిల్లింది.