![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/bjp-leaderfff-1.jpg?fit=219%2C319&ssl=1)
కశ్మీర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీ నేతను కాల్చిచంపారు. జమ్ముకశ్మీర్లోని బందిపోర్లో బీజేపీ నేత వసీమ్ కుటుంబం నివాసం ఉంటున్నది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో బీజేపీ నేత కుటుంబం ఓ దుకాణం వద్ద కూర్చొని ఉన్నది. ఇదే అదనుగా భావించిన ఉగ్రమూకలు అక్కడికి చొరబడి బీజేపీ నేత వసీమ్, అతడి తండ్రి బషీర్, సోదరుడు ఉమర్ బషీర్పై కాల్పులు జరిపారు. ఆ దుకాణం పోలీస్స్టేషన్కు సమీపంలో ఉన్నది. సమాచామందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వీరిని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిజానికి వసీమ్కు భద్రత సౌకర్యం ఉంది. కానీ ప్రమాదం జరిగే సమయంలో అతనికి భద్రతగా ఉండే ఎనిమిదిమంది గార్డుల్లో ఏ ఒక్కరూ ఘటనా స్థలంలో లేరు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన గార్డులపై కఠిన చర్యలను తీసుకోనున్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. వసీమ్ కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు.