Breaking News

రూ.200 కోట్లు ఇవ్వండి

రూ.200 కోట్లు ఇవ్వండి
  • భారత ఒలింపిక్ అసోసియేషన్

న్యూఢిల్లీ: పోస్ట్ కరోనాలో గేమ్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా షురూ కావాలంటే రూ.200 కోట్ల గ్రాంట్ ఇవ్వాలని భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) కేంద్ర క్రీడాశాఖకు విజ్ఞప్తి చేసింది. దేశంలో అన్ని క్రీడాసమాఖ్యలకు ఆర్థికసాయం చేయాలని కోరింది. ‘వచ్చే ఏడాది వరకు స్పాన్సర్లు రారు. ఈ సమయంలో ప్రభుత్వ సాయం చాలా అవసరం. గ్రాంట్ ఇవ్వకపోతే గేమ్స్​ను మొదలుపెట్టడం చాలా కష్టమవుతుంది. ఐవోఏకు రూ.10 కోట్లు, జాతీయ సమాఖ్యలకు రూ. 5కోట్లు, నాన్ ఒలింపిక్ స్పోర్ట్స్​ సమాఖ్యలకు రెండున్నర కోట్లు, స్టేట్ ఒలింపిక్ సంఘాలకు రూ.కోటి చొప్పున ఇవ్వాలి. ఇవన్నీ కలిపితే రూ.220 కోట్లు అవుతుంది’ అని ఐవోఏ ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా.. క్రీడాశాఖకు లేఖ రాశారు. ఈ అంశంపై మాట్లాడేందుకు క్రీడాశాఖ అధికారులు నిరాకరించారు..