![మాస్క్ కట్టుకోవాల్సిందే..](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/CP-2-F.jpg?fit=350%2C328&ssl=1)
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో తప్పనిసరిగా మాస్క్ కట్టుకోవాల్సిందేనని వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ సూచించారు. రోజు రోజుకు విస్తరిస్తున్న వ్యాధిని నియంత్రించడం కోసం ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వ ఇచ్చిన అదేశాలను గౌరవిస్తూ ప్రజలు తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతో పాటు సమాజ పరిరక్షణకు కృషిచేయాలన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి తిరిగితే డిజాస్టర్ మెనేజ్ మెంట్ యాక్ట్ 51(బి) మేరకు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.