Breaking News

మధ్యప్రదేశ్​లో టెన్త్​ ఎగ్జామ్స్​ రద్దు

మధ్యప్రదేశ్​లో టెన్త్​ ఎగ్జామ్స్​ రద్దు
  • ప్రభుత్వం సంచలన నిర్ణయం


భోపాల్‌:
టెన్త్‌క్లాస్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ కు సంబంధించి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వాయిదాపడ్డ పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్​సింగ్​ చౌహాన్​ ప్రకటించారు. ఇంతకు ముందు నిర్వహించిన ఎగ్జామ్స్‌ ఆధారంగా మార్కులు వేయనున్నట్లు చెప్పారు. దాని ప్రకారమే జాబితా ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. వాయిదాపడ్డ ఎగ్జామ్స్​కు సంబంధించి ‘పాస్‌’ రిమార్క్‌తో మార్క్‌ షీట్‌ ఇవ్వనున్నారు. కాగా,జూన్‌ 8 నుంచి 16 వరకు 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే 5 నుంచి 8 వ తరగతి వరకు పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసింది.