Breaking News

ఫ్రంట్​లైన్​ వారియర్స్‌కు అభినందన

ఫ్రంట్​లైన్​వారియర్స్‌కు అభినందన

సారథి న్యూస్, కర్నూలు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ పై విజయం సాధించేందుకు అహర్నిశలు కృషిచేసిన వైద్యులు, స్టాఫ్‌నర్సు, సిబ్బందిని కోవిడ్‌ వారియర్స్‌గా అభివర్ణించడానికి సంతోషిస్తున్నానని కర్నూలు మెడికల్​కాలేజీ ప్రిన్సిపల్‌, ఏడీఎంఈ డాక్టర్​చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం అధ్యాపకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్‌ నివారణకు మెరుగైన వైద్యసేవలు అందించారని, అందుకే పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు త్వరగా కోలుకుని ఇంటికి వెళ్తున్నారని అన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. సమావేశంలో సూపరింటెండెంట్‌ డాక్టర్​ నరేంద్రనాథ్‌ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ ​భగవాన్‌, డాక్టర్ ​నరసింహులు, డాక్టర్​ శంకర్‌ శర్మ, డాక్టర్​ ఇంద్ర, డాక్టర్​ రమాదేవి, డాక్టర్​ సింధియా, కర్నూలు మెడికల్​ కాలేజీ వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్​ చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.