![ఫ్రంట్లైన్వారియర్స్కు అభినందన](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/KNL-2-2.jpg?fit=677%2C259&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై విజయం సాధించేందుకు అహర్నిశలు కృషిచేసిన వైద్యులు, స్టాఫ్నర్సు, సిబ్బందిని కోవిడ్ వారియర్స్గా అభివర్ణించడానికి సంతోషిస్తున్నానని కర్నూలు మెడికల్కాలేజీ ప్రిన్సిపల్, ఏడీఎంఈ డాక్టర్చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అధ్యాపకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ నివారణకు మెరుగైన వైద్యసేవలు అందించారని, అందుకే పాజిటివ్ వచ్చిన వ్యక్తులు త్వరగా కోలుకుని ఇంటికి వెళ్తున్నారని అన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ భగవాన్, డాక్టర్ నరసింహులు, డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ ఇంద్ర, డాక్టర్ రమాదేవి, డాక్టర్ సింధియా, కర్నూలు మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.