![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/cm-fund.jpg?fit=996%2C437&ssl=1)
సారథి న్యూస్, రామాయంపేట: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని నిజాంపేట ఎంపీపీ సిద్దరాములు పేర్కొన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామానికి చెందిన నీలం నర్సయ్య ఇటీవల అనారోగ్యానికి గురికాగా అతడికి రూ. 60 వేల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కును అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయరాం, ఎంపీటీసీ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.