Breaking News

నెలరోజుల్లో నీళ్లు తెస్తా

  • హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​కుమార్​

సారథి న్యూస్​, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులపై కోర్టుల్లో వేసిన కేసులను కొట్టివేస్తే నెలరోజుల్లో నీళ్లు తెప్పిస్తానని ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ సవాల్ విసిరారు. ఆదివారం పట్టణంలోని తిరుమల గార్డెన్ లో వ్యవసాయ విధానంపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. రైతాంగం సుభిక్షంగా ఉండాలంటే ప్రభుత్వం నిర్దేశించిన పంటలను మాత్రమే పండించాలన్నారు. ప్రతిపక్షాలు ప్రాజెక్టులపై లేనిపోని రాద్ధాంతం చేస్తూ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రాజారెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి సభ్యులు, అగ్రికల్చర్, రెవెన్యూ ఆఫీసర్ పాల్గొన్నారు.