Breaking News

నర్సాపూర్​కు కాళేశ్వరం నీళ్లు

సారథి న్యూస్​, నర్సాపూర్​: మెదక్​ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని కొత్తకాలనీ, ఎంపీడీవో, తహసీల్దార్​ ఆఫీసుల ఎదుట వేస్తున్న సీసీరోడ్డు పనులను నర్సాపూర్ ఎమ్మెల్యే సి.మదన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో సీసీరోడ్లు వేసినట్లు తెలిపారు. త్వరలోనే నర్సాపూర్ నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా సాగునీరు తీసుకొస్తామన్నారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో కోటిలింగం, కాంట్రాక్టర్ రాజు, పంచాయతీ రాజ్ ఏఈ ప్రభాకర్, ఉపసర్పంచ్ చంద్రం శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.