Breaking News

దుస్తుల పంపిణీ


సారథి న్యూస్​, రామడుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకరెడ్డి జాతీయ పతాకం ఎగరవేశారు.ఈ సందర్భంగా అమరుల త్యాగాలను గుర్తుచేశారు. అనంతరం హమాలీలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అబ్దుల్ అజీజ్, పైడ్లా శ్రీను, రాగం లచ్చయ్య, శ్రీనివాస్ రెడ్డి, స్వామి, మచ్చ గంగయ్య, కోట్ల మల్లేశం, మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.