Breaking News

దీక్ష విరమించిన నేతలు

సారథి న్యూస్​,మహబూబ్​నగర్​: కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కృష్ణాజలాల పరిరక్షణ దీక్ష చేస్తున్న ఏఐసీసీ కార్యదర్శి, మాజీమంత్రి జిల్లెల చిన్నారెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నేత, టీపీసీసీ కార్యదర్శి జి.మధుసూదన్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతం చేపట్టిన దీక్షను స్థానిక కాంగ్రెస్​ నాయకులు విరమింపజేశారు. పెండింగ్​ ప్రాజెక్టులపై టీఆర్​ఎస్​ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. అలాగే టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు అరవింద్ కుమార్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డికి నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు.