Breaking News

డిప్రెషన్​లోకి పాయల్​ ఘోష్​

తానూ ఐదేండ్లుగా డిప్రెషన్​తో బాధపడుతున్నానంటూ ఊస‌ర‌వెళ్లి’ చిత్రం ఫేమ్​ పాయ‌ల్ ఘోష్‌ ఓ ట్వీట్ పెట్టింది. ఈ ట్వీట్​ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్​ అవుతోంది. తాను డిప్రెష‌న్‌కు గురైనప్పుడల్లా త‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితులు అండ‌గా నిల‌బ‌డుతున్నార‌ని పాయల్​ చెప్పుకొచ్చింది. మరోవైపు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య బాధ కలిగించిందని ట్వీట్​లో పేర్కొంది. 2009లో ‘ప్రయాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది పాయల్. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. తర్వాత ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. అయినా తెలుగులో అంతగా ఆఫర్లు వరించలేదామెను. ఇక ప్రస్తుతం అడపాదడపా ఎప్పుడో ఒక సినిమాలో మెరుస్తున్న పాయల్.. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా.. తాను గత ఐదేళ్లుగా డిప్రెషన్ తో ఇబ్బందిపడుతూ మెడిసన్స్ తీసుకుంటున్నట్లు చెప్పింది. అలాగే తనకు అలా డిప్రెషన్ అనిపిస్తే స్నేహితులకు ఫ్యామిలీ మెంబర్స్ కు ఫోన్ చేసి మాట్లాడతానని.. అలా డిప్రెషన్ దూరం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నా అంటోంది ఈ అమ్మడు. కానీ ఇంతకీ అసలు డిప్రెషన్ ఎందుకో చెప్పకుండా మానసిక ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ.. సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య పై చాలా బాధపడుతూ.. డిస్ట్రబ్ అయ్యానని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన అభిమానులను కూడా మానసిక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ.. ‘ఎప్పటికప్పుడు సెల్ఫ్ కేర్ తీసుకోండి..ఏదైనా అవసరమైతే కుటుంబీకులను.. స్నేహితులను సంప్రదించండి..’ అంటూ సూచించింది పాయల్.