Breaking News

టైమ్ పడుతుంది..

టైమ్ పడుతుంది..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే భారీ అంచనాలతో ఉంటుందనే ఆతృత ఉండడం సహజమే. ఆయన గురించి వచ్చే ప్రతి అప్​ డేట్స్​ను ఫాలో అవుతుంటారు చాలామంది ఫ్యాన్స్​. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ప్రభాస్ తర్వాత ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్​తో చేయనున్నాడని అధికారిక ప్రకటన వచ్చిన నాటి నుంచి ఆ సినిమా అప్​ డేట్స్​ కోసం తెగ ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఇందులో బాలీవుడ్ స్టార్స్, హాలీవుడ్ టెక్నీషియన్​ తో సినిమా ఉండనుందని తెగ పుకార్లు చక్కర్లు కొట్టాయి. కానీ అవేమీ నిజం కాదని ‘స్క్రిప్ట్ వర్స్ ఇంకా జరుగుతోందని, కాస్టింగ్ గురించి ఇంకా ఎవర్నీ అనుకోలేదని, కరోనా కారణంగా పనులు లేటవుతున్నాయని.. సినిమా సెట్​ పైకి రావడానికి చాలా టైమ్ పడుతుందని అంటున్నారు దర్శకులు నాగ్ అశ్విన్. మరి అప్పటి వరకూ ఆగడం తప్ప చేసేది ఏముంది. స్క్రిప్టును పక్కాగా రెడీ చేసుకుంటేనే కానీ నాగ్ అశ్విన్ మూవీని పట్టాలెక్కించడన్న విషయం ‘మహానటి’తోనే అర్థమయ్యిందిగా.