- కంటైన్మెంట్ జోన్ల వరకే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. అయితే, కేవలం కంటైన్మెంట్ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ కొనసాగుతుందని ప్రకటించింది. మే 31న లాక్డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించింది. అలాగే లాక్డౌన్ 5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు చేసింది. దశలవారీగా కొన్ని మినహాయింపులూ వెలువరించింది. అయితే, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టంచేసింది.
ఫేజ్-1
జూన్ 8 నుంచి ఆలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి ఉంటుంది. జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్ మాల్స్కు అనుమతిస్తారు.
ఫేజ్-2
స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం ఉంటుంది. విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం తీసుకుంటారు. విద్యాసంస్థల పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీచేస్తుంది.
వీటికి అనుమతి లేదు
మెట్రో రైలుసేవలకు అనుమతి లేదు. అలాగే అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు. సినిమా హాల్స్, జిమ్లు, స్విమ్మింగ్పూల్స్, పార్కులు, బార్లు, రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి పర్మిషన్ ఇవ్వలేదు.