![కరోనా నియంత్రణలో భేష్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/mini2.jpeg?fit=1280%2C583&ssl=1)
సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనాను సమష్టగా ఎదుర్కొన్నామని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం జిల్లాలో రెండు కరోనా కేసులు మాత్రమే ఉన్నాయని, త్వరలోనే జీరో అవుతాయని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ కు వచ్చిందని, త్వరలో గ్రీన్ జోన్ కు వస్తుందని, ఉపాధిలో 28వేల మందికి పనులు కల్పిస్తున్నామని చెప్పారు.
ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, అలాగే సామాజిక బాధ్యత తీసుకోవాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ ఎస్.వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ సురేందర్ పాల్గొన్నారు.