Breaking News

కక్షతోనే నవ్య ఆస్పత్రి సీజ్​

కక్షతోనే నవ్య ఆస్పత్రి సీజ్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: నల్లగొండలోని నవ్య హాస్పటల్ ను సీజ్ చేయడం, డాక్టర్ చెరుకు సుహాస్ ను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని తెలంగాణ ప్రజల పార్టీ తీవ్రంగా ఖండించింది. వారి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ గుప్తా, వర్కింగ్ ప్రసిడెంట్ శ్యాంసుందర్, వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్, జనరల్ సెక్రటరీ ఇంద్రసేనా, జాయింట్ సెక్రటరీ కోట్ల వాసుదేవ్ ప్రభుత్వానికి సూచించారు. అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో నవ్య హాస్పటల్ ను సీజ్ చేశారని, డాక్టర్ చెరుకు సుహాస్ అరెస్ట్ చేశారని ఆక్షేపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే యశోద, అపోలో లాంటి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులను సీజ్​చేసి చూపించాలని సవాల్​ విసిరారు. డాక్టర్ చెరుకు సుహాస్ పై పెట్టిన అక్రమ కేసులను తీసివేయాలని, కక్షపూరిత వైఖరి సరైంది కాదని హితవుపలికారు.