Breaking News

ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి

ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి

సారథి న్యూస్, నాగర్​ కర్నూల్: లాక్​ డౌన్​ నేపథ్యంలో జిల్లాలో ఉండిపోయిన వలస కార్మికులు, విద్యార్థులను వారివారి స్వస్థలాలకు తరలించేందుకు నోడల్ ఆఫీసర్లుగా అఖిలేష్ రెడ్డి, అనిల్ ప్రకాష్ ను నియమించినట్లు నాగర్​ కర్నూల్​ జిల్లా కలెక్టర్ శ్రీధర్ శుక్రవారం తెలిపారు. వలస కార్మికుల కోసం అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతినిస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని, అందుకు జిల్లాస్థాయిలో నోడల్ అధికారులను నియమించామని పేర్కొన్నారు.

మండలాల వారీగా కలెక్టరేట్​లో వివరాలను ఆయా నోడల్ ఆఫీసర్లు సేకరించారన్నారు. జిల్లాలో 6,660 మంది వలస కార్మికులు ఉన్నారని ప్రకటించారు. ఇతర ప్రాంత విద్యార్థులు, సొంత వాహనాలు కలిగినవారు మండల తహసీల్దార్లను కలిసి పాస్​ లు పొందొచ్చని, లేనివారు మాత్రం నోడల్ ఆఫీసర్లను సంప్రదిస్తే రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తారని కలెక్టర్​ స్పష్టంచేశారు.