Breaking News

అన్నికులాల అభ్యున్నతికి కృషి

అన్నికులాల అభ్యున్నతికి కృషి

సారథి న్యూస్, రామగుండం: టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని కులాలకు ప్రాధాన్యం దక్కిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం స్థానిక 18వ డివిజన్ లో పద్మశాలి నూతన భవనానికి ఎమ్మెల్యే భూమి పూజచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నికులాల అభ్యున్నతికి కృషిచేసిందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ బద్రి అంజలిదేవి, భూమయ్య, శంకర్, గుండ్ల రామచందర్, గుండేటి ప్రభాకర్ పాల్గొన్నారు.