సారథి న్యూస్, నాగర్ కర్నూల్: జీవనోపాధి కోసం పొట్ట చేతబట్టుకుని జిల్లాకు వచ్చిన ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు ప్రతి వ్యక్తికి 12 కేజీల బియ్యం, రూ.500 కచ్చితంగా పంపిణీ చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ ఆదేశించారు. బుధవారం జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు 6069 మంది వలస కూలీలకు పంపిణీ చేసినట్లు చెప్పారు. వలస కార్మికులంతా జిల్లాలో పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పనులు, ఇటుక బట్టీల్లో పనులు చేస్తున్నారని వివరించారు. ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాల కార్మికులు, గృహ నిర్మాణ రంగాల్లో బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కూలీలకు మొదటి విడత పంపిణీ చేసిన వివరాలను సాయంత్రంలోగా పంపించాలని సూచించారు.
- April 22, 2020
- లోకల్ న్యూస్
- కలెక్టర్
- నాగర్కర్నూల్ జిల్లా
- వలస కార్మికులు
- Comments Off on వలస కార్మికులకు డబ్బులు అందాలె