Breaking News

గిరిజన బిడ్డ ఫస్టియర్​లో టాప్

గిరిజన బిడ్డ ఫస్టియర్​లో టాప్

సామాజికసారథి, వెల్దండ: ఓ పేదింటి గిరిజన బిడ్డ మంగళవారం వెలువడిన ఇంటర్​మీడియట్​ ఫస్టియర్​ మంగళవారం వెలువడిన ఫలితాల్లో టాప్​ లేపింది. నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం నగారాగడ్డ తండాకు చెందిన రాత్లావత్ ​శారద, సల్యానాయక్ వ్యవసాయ కూలీలు. వారి ​కూతురు రాత్లావత్​ నందిని బాలానగర్​లో గురుకుల విద్యాలయంలో ఇంటర్మీడియట్​ బైపీసీ ఫస్టియర్​ చదువుతోంది. 433/440 మార్కులు సాధించి అందరి శభాష్​ అనిపించుకున్నది. కష్టపడి చదివి ఉత్తమ గ్రేడ్​ సాధించింది. నందిని వెల్దండ ఎంపీపీ విజయ జైపాల్​నాయక్ మరిది (జైపాల్​ నాయక్ స్వయానా​ సోదరుడు)​కూతురు. ఈ సందర్భంగా నందిని ‘సామాజికసారథి’తో మాట్లాడింది. డాక్టర్ ​కావడమే తన లక్ష్యమని.. పేదలకు సేవ చేస్తానని చెప్పుకొచ్చింది. ఆమెను తండావాసులు సన్మానించారు.