![గిరిజన బిడ్డ ఫస్టియర్లో టాప్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2022/06/inter.jpg?fit=578%2C450&ssl=1)
సామాజికసారథి, వెల్దండ: ఓ పేదింటి గిరిజన బిడ్డ మంగళవారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫస్టియర్ మంగళవారం వెలువడిన ఫలితాల్లో టాప్ లేపింది. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నగారాగడ్డ తండాకు చెందిన రాత్లావత్ శారద, సల్యానాయక్ వ్యవసాయ కూలీలు. వారి కూతురు రాత్లావత్ నందిని బాలానగర్లో గురుకుల విద్యాలయంలో ఇంటర్మీడియట్ బైపీసీ ఫస్టియర్ చదువుతోంది. 433/440 మార్కులు సాధించి అందరి శభాష్ అనిపించుకున్నది. కష్టపడి చదివి ఉత్తమ గ్రేడ్ సాధించింది. నందిని వెల్దండ ఎంపీపీ విజయ జైపాల్నాయక్ మరిది (జైపాల్ నాయక్ స్వయానా సోదరుడు)కూతురు. ఈ సందర్భంగా నందిని ‘సామాజికసారథి’తో మాట్లాడింది. డాక్టర్ కావడమే తన లక్ష్యమని.. పేదలకు సేవ చేస్తానని చెప్పుకొచ్చింది. ఆమెను తండావాసులు సన్మానించారు.