Breaking News

ప్రజాసమస్యల పరిష్కారానికే నిధులు

ప్రజాసమస్యల పరిష్కారానికే నిధులు

సారథి, పెద్దశంకరంపేట: ఎంపీపీ నిధులను ప్రజాసమస్యల పరిష్కారానికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు ఆదివారం వినతిపత్రం అందజేసినట్లు ఎంపీపీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం శ్రీనివాస్ తెలిపారు. మండల ప్రజాపరిషత్ కు కేటాయించిన 15 ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి ఇప్పటి నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని మంత్రికి మెమోరాండం సమర్పించినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ నిధులు ఉపయోగించడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.