![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/acpt.jpeg?fit=1152%2C648&ssl=1)
సారథి న్యూస్, అచ్చంపేట: అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పకార్యమని ప్రభుత్వ విప్ గువ్వల బాల్ రాజు అన్నారు. శుక్రవారం అచ్చంపేటలో స్వేరోస్ నెట్వర్క్ నిర్వహించిన బ్లడ్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా ఆపద సమయంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని సూచించారు. నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తులసిరాం, మహబూబ్ నగర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజు, నాగర్ కర్నూల్ రెడ్ క్రాస్ కార్యదర్శి రమేష్ రెడ్డి, రమేష్ కుమార్, స్వేరోస్ రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు అంజన్న, శంకర్, గణేష్, సీఆర్వో అశోక్, ఫిట్ ఇండియా నాయకులు కనకం బాబు, సమ్మన్న, కానిస్టేబుల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.