Breaking News

సబ్సిడీపై జనుము విత్తనాలు

సబ్సిడీపై జనుము విత్తనాలు

పంపిణీ చేసిన సొసైటీ చైర్మన్​

సారథి న్యూస్, చేవెళ్ల: చేవెళ్ల సొసైటీ పరిధిలోని రైతులకు శనివారం పీఏసీఎస్​ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డితో కలిసి సబ్సిడీపై జనుము విత్తనాలను పంపిణీ చేశారు. వంద కిలోల బస్తా రూ.6,600 ఉండగా, రూ.4,290 సబ్సిడీ పోనూ రైతులు రూ.2,310 చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సున్నపు వసంతం, గుండాల రాములు, సర్పంచ్​ల సంఘం మాజీ అధ్యక్షుడు రెడ్డిశెట్టి మధుసూదన్ గుప్తా, పీఏసీఎస్​ వైస్ చైర్మన్ చిలుకూరి వెంకటేశం, పీఏసీఎస్​ డైరెక్టర్లు పాటి  దామోదర్ రెడ్డి, నత్తి క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.