Breaking News

వ్యాధుల నుంచి జాగ్రత్తగా ఉండాలి

సారథి న్యూస్​, రామగుండం: కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్​లో ప్లాన్​ ప్రకారం అభివృద్ధి పనులను పూర్తిచేస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతిలో భాగంగా 37, 46వ డివిజన్ లో పర్యటించారు. ఇంటిలో వాడిన నీటిని డ్రైనేజీల్లోకి వెళ్లేలా చూసుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంతకుముందు రామగుండం కార్పొరేషన్ ఆఫీసు ఆవరణ, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ తరాల మనుగడ ఉంటుందన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. ఆయన వెంట నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కమిషనర్ ఉదయ్ కుమార్, పాతపెల్లి ఎల్లయ్య, చెలకలపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.