![రైతులను ఆదుకోండి: సీపీఐ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/WhatsApp-Image-2020-04-29-at-1.46.19-PM.jpeg?fit=1280%2C588&ssl=1)
రైతులను ఆదుకోండి: సీపీఐ
సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ..
సారథి న్యూస్, గోదావరిఖని(పెద్దపల్లి):ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలని సీపీఐ నాయకులు
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ నారాయణను కలిపి వినతిపత్రం అంజదేశారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ.. పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలంటే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
కాంటా వేసిన వెంటనే రసీదు ఇవ్వాలని, రైస్ మిల్లర్ల కోతలను అరికట్టాలని, అకాలవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు టార్ఫాలిన్ కవర్లు అందజేయాలని డిమాండ్ చేశారు. తాలు పేరుతో కోతను అరికట్టాలని కోరారు.
వినతిపత్రం ఇచ్చిన వారిలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బాలసాని లెనిన్, ఆరేపల్లి మానస్ కుమార్, సీసీపీ నగర కార్యదర్శి చంద్రగిరి ఉదయ్ పాల్గొన్నారు.