Breaking News

రైతులను ఆదుకోండి: సీపీఐ

రైతులను ఆదుకోండి: సీపీఐ

రైతులను ఆదుకోండి: సీపీఐ

సీపీఐ జిల్లా కార్యదర్శి  తాండ్ర సదానందం మాట్లాడుతూ..

సారథి న్యూస్​, గోదావరిఖని(పెద్దపల్లి):ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలని సీపీఐ నాయకులు

ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ నారాయణను కలిపి వినతిపత్రం అంజదేశారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి  తాండ్ర సదానందం మాట్లాడుతూ.. పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలంటే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

కాంటా వేసిన వెంటనే రసీదు ఇవ్వాలని, రైస్​ మిల్లర్ల కోతలను అరికట్టాలని, అకాలవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు టార్ఫాలిన్​ కవర్లు అందజేయాలని డిమాండ్​ చేశారు. తాలు పేరుతో కోతను అరికట్టాలని కోరారు.

వినతిపత్రం ఇచ్చిన వారిలో ఏఐఎస్​ఎఫ్​ జిల్లా కార్యదర్శి బాలసాని లెనిన్​, ఆరేపల్లి మానస్​ కుమార్​, సీసీపీ నగర కార్యదర్శి చంద్రగిరి ఉదయ్​ పాల్గొన్నారు.