![క్రీడా పురస్కారాల గడువు పొడిగింపు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/WhatsApp-Image-2020-06-04-at-11.56.36-AM.jpeg?fit=647%2C404&ssl=1)
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాల తుది గడువును ఈనెల 22 వరకు కేంద్ర క్రీడాశాఖ పొడిగించింది. క్రీడా అధికారులు, సమాఖ్యలు, అసోసియేషన్ల ప్రతిపాదన లేకుండా.. అథ్లెట్లు ‘సెల్ఫ్ నామినేషన్’ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దేశ వ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది అధికారులు, సమాఖ్యలు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఆదేశాల ప్రకారం అవార్డుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి ఎవరి ప్రతిపాదన అవసరం లేదు. అథ్లెట్ తనకు సంబంధించిన విషయాలతో కూడిన సొంత దరఖాస్తును పంపించుకోవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.