Breaking News

కరోనాను తరిమికొడదాం

కరోనాను తరిమికొడదాం

సారథి న్యూస్​, మహబూబ్​నగర్​: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని సామాజిక దూరం పాటించి తరిమికొట్టాలని తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నాగర్​కర్నూల్ జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతంలోని మన్ననూర్, అమ్రాబాద్, మాధవానిపల్లి గ్రామాల్లో ఆదివాసీ చెంచులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ కారణంగా జనజీవనానికి, దినసరి కూలీలకు ఇబ్బందులు అయినప్పటికీ లాక్ డౌన్ తప్పదన్నారు. లాక్ డౌన్ కారణంగా ఆదివాసీ చెంచులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొంతైనా ఆదుకోవాలని నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, అంజయ్య, కాటం జగదీష్, లక్ష్మీపతి, రామస్వామి, నవీన్ కుమార్, ఉస్మాన్ అలీ పాల్గొన్నారు.