Breaking News

ఆరుగురు ఈడీ ఆఫీసర్లకు కరోనా

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లోని ఆరుగురు అధికారులకు కరోనా(కోవిడ్​–19) పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌ను అధికారులు రెండురోజుల పాటు సీజ్‌ చేశారు. ఆఫీస్‌ మొత్తం శానిటైజేషన్​ చేస్తున్నట్లు చెప్పారు. ఆ ఆరుగురితో సన్నిహితంగా ఉన్న మరో పదిమందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు చెప్పారు. సెంట్రల్‌ పారామిలటరీ ఫోర్స్‌ నుంచి ఇటీవల డిప్యూటేషన్‌ పై వచ్చిన ఓ జూనియర్‌‌ లెవల్‌ ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆయన ద్వారా వీరికి ప్రబలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీస్‌ను వారానికి రెండు రోజులు శానిటైజ్‌ చేస్తున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే ఎంప్లాయీస్‌ హాజరవుతున్నారు. ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా కేసులు రావడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.