- హార్దిక్ పాండ్యా వీరోచిత బ్యాటింగ్
- హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న గబ్బర్
సిడ్నీ: పొట్టి క్రికెట్లో టీమిండియా గట్టి సవాల్ను ఛేదించింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 సిరీస్ను టీమిండియా ఒక మ్యాచ్మిగిలి ఉండగానే సీరిస్ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో కోహ్లీసేన ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా 2–0 తేడాతో సిరీస్ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్ను టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్చేపట్టిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఫించ్ గాయం కారణంగా మ్యాచ్కు దూరమవడంతో ఆసీస్ తాత్కాలిక కెప్టెన్ మాథ్యూ వేడ్ మాస్టర్ ఓపెనర్గా 32 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో 58 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ డీఆర్సీ షార్ట్(9) నటరాజన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. స్మిత్(46) రాణించాడు. మ్యాక్స్వెల్ 22, హెన్రిక్యూస్ 26 పరుగులు చేశారు. చివరి ఓవర్లో స్టాయినిస్ బ్యాట్ను ఝళిపించాడు. ఏడు బంతుల్లో సిక్స్ సాయంతో 16 పరుగులు చేశాడు. 20 ఓవర్లలో ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. భారత బౌలర్లలో టి.నటరాజన్రెండు, వైఎస్చాహల్, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్చొప్పున తీశారు.
ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా స్టార్ ఓపెనర్లు శిఖర్ధవన్, కేఎల్రాహుల్ మొదటి నుంచే ధాటిగా ఆడారు. కేఎల్ రాహుల్ సొగసైన షాట్లతో స్కోరును పరుగెత్తించాడు. 22 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్తో 30 పరుగులు చేశాడు. శిఖర్ధవన్36 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్లతో 52 పరుగులు చేశాడు. ఈ టైమ్లో స్విప్సన్కు క్యాచ్ఇచ్చి వెనుదిరగడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు ఫోర్లు, రెండు సిక్స్లతో స్కోరును పరుగెత్తించాడు. ఆ తర్వాత వచ్చిన శాంసన్ 15 పరుగులకే వెనుదిరిగాడు. హార్దిక్పాండ్యా, శ్రేయస్ అయ్యర్ అదే ఊపును కొనసాగించారు. పాండ్యా 22 బంతుల్లో మూడు సిక్స్లు, రెండు ఫోర్లతో 42 పరుగులతో విన్నింగ్ విక్టరీ కొట్టాడు. శ్రేయస్ అయ్యర్ 5 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్తో 12 పరుగులు సాధించాడు. టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్బౌలర్లలో సామ్స్, టై, స్వీప్సన్, జంపా ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ప్లేయర్ ఆఫ్ మ్యాచ్గా హార్దిక్పాండ్యా నిలిచాడు.