న్యూఢిల్లీ: సమయం వచ్చినప్పుడల్లా టెస్ట్ క్రికెట్పై తన అభిమతాన్ని చాటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టాడు. టెస్టులకు ఉండే విలువ ఏ ఫార్మాట్కు ఉండదని స్పష్టం చేశాడు. ‘మెరిసే తెల్లని దుస్తులతో ఎర్రబంతితో క్రికెట్ ఆడడం నా అదృష్టం. ముఖ్యంగా ఈ ఫార్మాట్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం మరింత గర్వపడే అంశం. దీని దరిదాపుల్లోకి ఏదీ రాదు. టెస్ట్ క్రికెటే నిజమైన ఆట. అందుకే ఈ ఫార్మాట్కు మరింత ప్రాచుర్యం కల్పించాలి. దీనికి నా వంతు సహకారం అందిస్తా’ అని విరాట్ పేర్కొన్నాడు.
- June 26, 2020
- Archive
- Top News
- క్రీడలు
- KOHLI
- TEAMINDAIA
- TEST CRICKET
- టీమిండియా
- భారత్
- విరాట్కోహ్లీ
- Comments Off on భారత్కు టెస్టులు ఆడడం నా అదృష్టం