Breaking News

నిషేధంపై ఉమర్ అప్పీల్

నిషేధంపై ఉమర్ అప్పీల్
  • స్వతంత్ర కమిటీని నియమించిన పీసీబీ

కరాచీ: తనపై విధించిన మూడేళ్ల నిషేధంపై పాక్ బ్యాట్స్​ మెన్​ఉమర్ అక్మల్ అప్పీల్​కు వెళ్లాడు. దీంతో ఈ కేసును విచారించేందుకు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్వతంత్ర కమిటీని నియమించింది. విచారణ సందర్భంగా తన వాదనలను బలంగా వినిపించేందుకు బాబర్ అవాన్​ కు చెందిన లా ఫర్మ్​ ను అక్మల్ ఉపయోగించుకోనున్నాడు. అవాన్.. పాక్ ప్రధాని ఇమ్రాన్​ కు పార్లమెంటరీ అఫైర్స్ సలహాదారుడిగా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది పాకిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సందర్భంగా కొందరు ఫిక్సర్లు ఉమర్‌ను కలవగా.. అతను ఆ విషయాన్ని దాచిపెట్టాడు. దీంతో పీసీబీ గతనెలలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. మూడేళ్ల పాటు ఉమర్‌ ఏ ఫార్మాట్‌ క్రికెట్‌లోనూ ఆడకూడదని శిక్ష విధించింది.