Breaking News

కరీనా షాకింగ్​ కామెంట్స్​

కరీనా షాకింగ్​ కామెంట్స్​

సుశాంత్​సింగ్ రాజ్​పుత్​ సుసైడ్​ తర్వాత బాలీవుడ్​ మొత్తం ‘నెపోటిజం’ (బంధుప్రీతి) అనే అంశంపై అట్టుడుకుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు నటులు స్పందించారు. తాజాగా స్టార్​ హీరోయిన్​ కరీనా కపూర్​ కూడా నెపోటిజం స్పందించారు. ఓ జాతీయ ఛానల్​కు ఇచ్చని ఇంటర్వ్యూలో ఆమె ఈ అంశంపై మాట్లాడారు. కరీనా ఏమందంటే.. ‘స్టార్‌లను తయారు చేసేది ప్రేక్షకులే తప్ప వారసత్వం కాదు. కొందరు పనిగట్టుకొని ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. 21 ఏళ్ల నా కెరీర్‌కు స్టార్ వారసత్వం మాత్రమే కారణం కాదు. అయితే వారసత్వం అనేది ఇండస్ట్రీలో తేలికగా అడుగుపెట్టడానికి ఉపయోగపడుతుంది. తర్వాత టాలెంట్​ ఉన్నవారే పైకొస్తారు. షారూక్​ ఖాన్, అక్షయ్ కుమార్, రాజ్‌కుమార్ రావు వంటి ఎందరో స్టార్లు బయటి నుంచి వచ్చిన వారే. అలియా భట్ అయినా, కరీనా కపూర్ అయినా.. ఇంకెవరైనా కష్టపడి పనిచేస్తేనే ప్రజల ఆమోదం లభిస్తుంది. మేం సరిగ్గా నటించకపోతే వారే వద్దంటారు. చాలా మంది స్టార్ వారసులు ప్రేక్షకుల ఆమోదం పొందలేదు’అని కరీనా చెప్పుకొచ్చింది.