సారథి న్యూస్, హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత రావి కొండలరావు మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ‘1958లో శోభ’ చిత్రంతో కొండలరావు సినీ ప్రస్థానం మొదలైంది.