సామాజిక సారథి, వరంగల్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మరోసారి మెడికోలు కరోనా బారిన పడ్డారు. ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్న కొంత మందిలో మెడికల్ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉండడం తో టెస్టులు చేయగా టెస్టులు చేసిన వారిలో 17 మందికి కరోనా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కరోనా వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
సూర్యాపేట ర్యాగింగ్ ఘటనపై సర్కారు సీరియస్ ఆరుగురు వైద్యవిద్యార్థులపై కేసు నమోదు సామాజికసారథి, సూర్యాపేట: సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ర్యాగింగ్ బాధ్యులను గుర్తించిన అధికారులు ఆరుగురు మెడికోలను సస్పెండ్ చేశారు. ఏడాది పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కాలేజీ హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాలేజీలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్ రావు విచారణకు ఆదేశించిన […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు మెడికల్ కాలేజీ నెఫ్రాలజీ విభాగానికి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కు రెండు సీట్లు అప్రూవల్ వచ్చాయని డీఎంఈ, ప్రిన్సిపల్ డాక్టర్ పి.చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ఇన్నిరోజుల తర్వాత అప్రూవల్వచ్చిందన్నారు.