సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల సమరానికి తెలంగాణ రాష్ట్రంలో నేటితో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. నాలుగో విడతలో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి నేటి సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుండటంతో అభ్యర్థులు పోల్ మేనేజ్ మెంట్ పైన దృష్టిపెట్టనున్నారు. దీనికి ఆదివారం ఒక్కరోజు కీలక కావడంతో ఏయే నియోజకవర్గాల్లో ఏ వ్యూహాలను అనుసరించాలి, ఎక్కడెక్కడ తమకు అనుకూలంగా లేని పరిస్థితులను మార్చుకోవాలన్న దానిపై దృష్టిసారించారు. […]
బెంగాల్ దంగల్ లో దీదీ విజయం ఎత్తులు వేసి.. చిత్తయిన బీజేపీ తమిళనాడులో డీఎంకే జయకేతనం కేరళలో రెండోసారి విజయన్ సర్కారు అసోం, పుదుచ్చేరిని దక్కించుకున్న ఎన్డీఏ న్యూఢిల్లీ: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ దుమ్ములేపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 209 సీట్లను కైవసం చేసుకుంది. దీదీ సారథ్యంలో తీన్ మార్ మోగించింది. ఏకంగా అధికారాన్ని చేపడతామని గొప్పలు చెప్పిన కాషాయదళం మమతా బెనర్జీ ఎత్తుల ముందు బోల్తాపడింది. మార్చి 27 […]
బీజాపూర్ జిల్లా తెర్రం అటవీప్రాంతంలో భీకర ఎన్కౌంటర్ నేలకొరిగిన 22 మంది జవాన్లు మృతి పరామర్శించిన ఛత్తీస్గడ్ సీఎం భూపేష్ బాగెల్ నేడు ఛత్తీస్ గఢ్కు హోంమంత్రి అమిత్ షా సారథి, కరీంనగర్, ఖమ్మం: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా తెర్రం అటవీ ప్రాంతం తుపాకుల కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. మావోయిస్టుల భీకర దాడిలో సుమారు 22 మంది జవాన్లు నేలకొరిగారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో జవాన్లు విగతజీవులుగా చెల్లాచెదురుగా పడి ఉన్నారు. గాయపడినవారిని చికిత్స కోసం పలు […]
సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే హైదరాబాద్ ను ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటించారు. సిటీలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తామన్నారు. ‘నిజాం సంస్కృతిని వదిలి.. నయా హైదరాబాద్ ను నిర్మిద్దాం.. కుటుంబ పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు వెళ్దాం.. అవినీతి నుంచి పారదర్శక పాలన తీసుకొద్దాం.. సంతుష్టీకరణ నుంచి సమష్టి అభివృద్ధి వైపు పయనిద్దాం..’ అని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు ఆదివారం […]
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పీఠాన్ని వరుసగా నాలుగోసారి ఆయన సొంతం చేసుకున్నారు. అంతేకాదు 69 ఏళ్ల నితీష్ కుమార్ ఎక్కువ సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఘనతను దక్కించుకున్నారు. సోమవారం రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి బీజేపీ నేత, కేంద్రమంత్రి అమిత్షా, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.
న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి కరోనా సోకి మరణించారు. లక్షణాలేమీ లేకున్నా (అసింప్టమేటిక్) కరోనాతో రెండువారాల క్రితం ఢిల్లీలోని ఏయిమ్స్లో చేరిన ఆయన.. బుధవారం తుదిశ్వాస విడిచారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆయనకు శ్వాసకోస ఇబ్బందులు తలెత్తడంతో ఆరోగ్యం క్షీణించింది. కోవిడ్ వల్ల మరణించిన తొలి కేంద్ర మంత్రి ఆయనే. కర్నాటకకు చెందిన సురేశ్ అంగడి.. బెల్గావి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు […]
ఢిల్లీ: ఇటీవలే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన కేంద్రహోం మంత్రి అమిత్ షా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఎయిమ్స్కు తరలించారు. ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా పాటిజివ్ గా నిర్ధారణ అయ్యింది. గురుగ్రామ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందిన ఆయన 14న డిశ్చార్జి అయ్యారు. అయితే ఆగస్టు 18న అయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎయిమ్స్లో […]
ముంబై: వివాదాస్పద బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్కు కేంద్రప్రభుత్వం ‘వై ప్లస్’ సెక్యూరిటీ కల్పించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతిచెందిన అనంతరం కంగనా రనౌత్ వరసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ముంబై చిత్రపరిశ్రమలోని డ్రగ్స్ వాడకంపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో కేంద్రం ఆమెకు భద్రత కల్పించింది. వై ప్లస్ భద్రతతో ఆమెకు 11 మంది సీఆర్పీఎఫ్ కమెండోలు ఆమెకు రక్షణగా నిలువనున్నారు. ఇటీవల కంగనా మహారాష్ట్ర […]