సామాజిక సారథి, వరంగల్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మరోసారి మెడికోలు కరోనా బారిన పడ్డారు. ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్న కొంత మందిలో మెడికల్ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉండడం తో టెస్టులు చేయగా టెస్టులు చేసిన వారిలో 17 మందికి కరోనా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కరోనా వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
సూర్యాపేట ర్యాగింగ్ ఘటనపై సర్కారు సీరియస్ ఆరుగురు వైద్యవిద్యార్థులపై కేసు నమోదు సామాజికసారథి, సూర్యాపేట: సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ర్యాగింగ్ బాధ్యులను గుర్తించిన అధికారులు ఆరుగురు మెడికోలను సస్పెండ్ చేశారు. ఏడాది పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కాలేజీ హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాలేజీలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్ రావు విచారణకు ఆదేశించిన […]
రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య భట్టుకు ఫిర్యాదు విచారణకై పోలీసులకు ఆదేశం సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గత కొంతకాలంగా విద్యార్థినిల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, వేధిస్తున్నారని బీసీ గురుకుల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య భట్టుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బీసీ గురుకుల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య భట్టు సోమవారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి వసతులు, విద్యాబోధన, […]
సామాజిక సారథి, ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతకాని జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం సృష్టించింది. బుధవారం పాఠశాలలోని 100మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేయగా ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పదోతరగతిలో ఇద్దరికి, 6,8,9 తరగతులకు చెందిన ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణయిందని వైద్య సిబ్బంది తెలిపారు.