సారథి న్యూస్, నరసన్నపేట: ప్రజారంజక సంక్షేమ పథకాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపిన వైఎస్జగన్మోహన్రెడ్డి చిరకాలం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నరసన్నపేట పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి వైఎస్సార్ జంక్షన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇడుపులపాయలో మొదలుపెట్టి 14 నెలల పాటు 3,648 కిమీ. పొడవునా 134 […]
సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలో వైఎస్సార్సీపీ టౌన్అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు వైఎస్సార్విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మద్దూర్ నగర్ లో శరణాలయానికి టీవీ, మంచాలు, ఫ్యాన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త […]
సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని కాంగ్రెస్నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల చెక్ పోస్టు దామోదరం సంజీవయ్య సర్కిల్ సమీపంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్హయాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. అప్పటి కాంగ్రెస్ప్రభుత్వం 104, 108సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాకు తాగు, సాగునీటిని అందించిన ఘనత […]
సారథి న్యూస్, కడప: దివంగత ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ఘాట్ వద్ద ఏపీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి తల్లి విజయమ్మ, సతీమణి భారతి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ట్విట్టర్ వేదికగా తన తండ్రి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ‘నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు అవుతుంది. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ […]
‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకానికి శ్రీకారం ‘అంగన్వాడీ పిలుస్తోంది’కి విశేష స్పందన సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలోని బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకాన్ని సెప్టెంబర్ 1న ప్రారంభించనున్నారు. గతంలో గిరిజనులకు మాత్రమే వర్తించే ఈ పథకం ఇక నుంచి అందరికీ వర్తించనుంది. పథకంలో భాగంగా రాగిపిండి కేజీ, బెల్లం 250 గ్రాములు, చిక్కి 250 గ్రాములు, ఎండు ఖర్జూరం 250 గ్రాములు, సజ్జ లేదా […]
సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి వేడుకలను నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసింహయాదవ్ ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల చెక్ పోస్టు దామోదరం సంజీవయ్య సర్కిల్ సమీపంలోని ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలుచేశారని కొనియాడారు. తాగు, సాగునీరు అందించిన ఘనత వైఎస్సార్కే దక్కిందన్నారు. ఆయన ఆశయసాధనకు కాంగ్రెస్పార్టీ కృషిచేస్తుందన్నారు. రాహుల్గాంధీని ప్రధానమంత్రి చేయాలని కలలుగన్నారని గుర్తుచేశారు. […]
సారథి న్యూస్, అనంతపురం: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి(జులై 8)ని రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాది వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని వ్యవసాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రైతుల కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ చర్యలు చేపట్టారని, ఆయన సంస్మరణార్థం రైతు దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయంపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.