హెలికాప్టర్ ప్రమాద మృతుల గుర్తింపు మరో ఆరుగురి మృతదేహాల అప్పగింత న్యూఢిల్లీ: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారిలో మరో ఆరుగురి మృతదేహాలను శనివారం గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సైనికాధికారి సాయితేజతో పాటు వివేక్ కుమార్, మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను గుర్తించారు. వారి పార్థీవదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించనున్నామని, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగిలిన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. […]
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సాయుధ దళాల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా కోరారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆయన తన వంతు విరాళం అందజేసి సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు […]
సారథి న్యూస్, ఎల్బీనగర్: భారత్, చైనా సైనికుల ఘర్షణలో అమరుడైన కల్నాల్ సంతోష్ బాబు, ఇతర అమర సైనికులకు బీజేపీ మన్సురాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వలిశెట్టి మహేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సహారా ఎస్టేట్ చౌరస్తాలోని వివేకానంద విగ్రహం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో కడారి యాదగిరి యాదవ్, మన్సురాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షుడు పాతూరి శ్రీధర్ గౌడ్, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దేవరకొండ లింగాచారి, వేణు గౌడ్, బీజేవైఎం మన్సురాబాద్ డివిజన్ సంద […]
సారథిన్యూస్, సూర్యాపేట: భారత్ – చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి మృతిచెందారు. సూర్యాపేటకు చెందిన సంతోష్ కుమార్ భారత్-చైనా సరిహద్దులో కల్నల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం ఇరుదేశాల బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో సంతోష్ ప్రాణాలు కోల్పోయాడు. ఆర్మీ అధికారులు సూర్యాపేటలోని ఆయన కుటుంబసభ్యులకు మరణవార్తను తెలిపారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు. సంతోష్ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. సంతోష్ మరణ […]