కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణ ఎంపిక 12న అందించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సామాజిక సారథి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాలను శనివారం ప్రకటించింది. రెండేళ్ల కాలానికి ఇద్దరిని ఎంపిక చేశారు. 2018, 2019 సంవత్సరాలకు గాను కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణను పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ నెల 12న హైదరాబాద్లోని విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పురస్కారాలను అందజేయనున్నారు. పురస్కారంగా ఒక్కొక్కరికి రూ.లక్ష నగదుతో […]
సామాజిక సారథి, చిలప్ చెడ్ : ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్రనగర్ లో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను చిలప్ చెడ్ మండల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం తునికి ఆధ్వర్యంలో చిలప్ చెడ్ మండలానికి సంబంధించిన కొందరు రైతులతో రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ఆరుతడి పంటలకు సంబంధించిన పనిముట్లు పరికరాలను పరిశీలించారు. కేవీకే శాస్త్రవేత్త ఉదయ్ కుమార్, రవి, మండల రైతు […]
సారథి న్యూస్, కర్నూలు: రాయసీమ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, వెంటనే ఇవ్వాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం యూనివర్సిటీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డిపోగు, జేఏసీ నాయకులు నాగరాజు, సురేష్ కోరారు. ప్రొఫెసర్ల జీతాలు చెల్లించకపోవడంలో యూనివర్సిటీ ఇన్చార్జ్ ఉపకుపతి ఎంఎం నాయక్ తీరును ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కొంత మంది యూనివర్సిటీ అధికారులు టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇన్చార్జ్ ఉపకుపతిని తొలగించి, రెగ్యులర్ వీసీని నియమించాలని డిమాండ్చేశారు. […]
ప్రైవేట్ కంపెనీలూ ఉత్పత్తి చేయొచ్చు స్టూడెంట్స్ కోసం మనోదర్పణ్ వంద యూనివర్సిటీల్లో ఆన్ లైన్ కోర్సులు రైతులకు నేరుగా రూ.3వేల కోట్లు ఇచ్చాం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ న్యూఢిల్లీ: బొగ్గు, ఏవియేషన్, స్పేస్, డిఫెన్స్ రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలు తయారుచేసే ఉత్పత్తులను ప్రైవేట్ కంపెనీలు కూడా ఉత్పత్తి చేయొచ్చని ప్రకటించారు. డిసెంబర్ నాటికి ‘నేషనల్ ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ మిషన్’ను ప్రారంభిస్తామని, […]
సారథి న్యూస్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల సెమిస్టర్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించే విధానం ప్రవేశపెట్టాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఇంటర్ నెట్ స్పీడ్ పెంచడం, బ్యాండ్ విడ్త్, సెక్యూరిటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. దేశంలోని టెక్నాలజీ వర్సిటీల్లో ఆన్లైన్ పరీక్షలపై అధ్యయనం జరుగుతున్నదని జేఎన్టీయూహెచ్ ఇన్ చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు.