సారథి న్యూస్ రామడుగు: ప్రధాన్ మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోలి రామయ్యపల్లి గ్రామంలో అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 14 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారందరికీ ఉచితంగా కంప్యూటర్, డిజిటల్ లావాదేవీలు, కిసాన్ క్రెడిట్కార్డుకు దరఖాస్తు చేసుకునే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించినట్టు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో కేంద్రప్రభుత్వ అధికారులతో పాటు సర్పంచ్ ఉప్ప రాధమ్మ, ఉపసర్పంచ్ కనకయ్య, […]
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది.తాజాగా ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో 66 శాతం మంది మోడీ పాలన బాగుందని , తర్వాత కూడా ఆయనే ప్రధానిగా ఉండాలని కోరుకున్నారు. రాహుల్గాంధీ ప్రధానిగా ఉండాలని 8 శాతం మంది, సోనియా ప్రధాని కావాలని కేవలం 5 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు. నాలుగు శాతం మంది కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, మూడు శాతం మంది యోగి ఆదిత్య నాథ్ ను, […]
అయోధ్య: ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు బయలుదేరారు. రోజువారి వస్త్రధారణకు భిన్నంగా మోడీ పంచెకట్టులో కనిపించారు. లక్నో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత హెలికాప్టర్లో అయోధ్యకు ప్రధాని పయనమవుతారు. తొలుత ఆయన హనుమాన్ గర్హిలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అయోధ్యను అధికారులు అణువణువునా శానిటైజ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. రంగురంగుల పూల […]
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్ వరకు ప్రజలకు ఉచితంగా రేషన్ అందజేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. వన్ నేషన్.. వన్ రేషన్ కింద దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న పేదలైనా ప్రభుత్వ సాయం పొందవచ్చని చెప్పారు. వలస కూలీలను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని ప్రవేశపెడుతుమన్నారు. రేషన్ కార్డు ఉన్న నిరుపేదలందరికీ నెలకు 5 కిలోల బియ్యం, గోధుమలు, కిలో కందిపప్పు అందజేస్తామని చెప్పారు. 80 కోట్లమంది ఈ పథకం కింద లబ్ధి పొందుతారని ప్రధాని చెప్పారు. […]