సర్వీస్ క్రమబద్ధీకరిస్తామని ఎండీ సజ్జనార్భరోసా సామాజికసారథి, హైదరాబాద్: కొత్త సంవత్సరం తొలి రోజున ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీపికబురు అందించారు. ఎన్నో ఏళ్లుగా ఔట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వారిని రానున్న రోజుల్లో పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకుంటామని భరోసాఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపడుతున్నామని సజ్జనార్ ప్రకటించారు. ‘సంస్థ అభివృద్ధి చెందితే.. మనందరం బాగుపడతాం. టీఎస్ఆర్టీసీ ఏ ఒక్కరిది కాదు.. మనందరిదీ. ఇందులో ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఉన్నన్ని రోజులు సంస్థ అభివృద్ధి కోసం […]
రాత్రి 8గంటల కల్లా డ్యూటీ విరిమించేలా సజ్జనార్ఆదేశాలు సామాజిక సారథి, హైదరాబాద్: మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకల్లా తమ డిపోలకు చేరేలా డ్యూటీలు వేయాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మె ముగిసిన తర్వాత 2019 డిసెంబర్1వ తేదీన అన్నిస్థాయిల ఉద్యోగులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో డ్యూటీ సమయాలు ఇబ్బందికరంగా ఉన్నాయని పలువురు మహిళా కండక్టర్లు ఫిర్యాదు చేశారు. రాత్రి […]
ఇక పెరగనున్న బస్సుచార్జీలు ఆర్డినరీ బస్సుల్లో కి.మీ. 0.25 పైసలు ఇతర బస్సుల్లో 0.30 పైసలు ప్రభుత్వానికి యాజమాన్యం ప్రతిపాదనలు చార్జీల పెంపు అనివార్యమైంది: మంత్రి అజయ్ మూడేళ్లలో ఆర్టీసీకి రూ.4,260 కోట్ల నష్టం నష్టాల తగ్గింపునకు మరోమార్గం లేదు: ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సామాజిక సారథి, హైదరాబాద్: అందరూ ఊహించిన విధంగానే ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్కు 0.25 పైసలు, ఇతర బస్సుల్లో 0.30 పైసలు మేర చార్జీలు ప్రభుత్వం పెంచనుంది. […]
లక్ష రూపాయల నగదు, బంగారం చోరీ సామాజిక సారథి, సంగారెడ్డి: సదాశివపేటలో బస్సు ఎక్కిన మహిళ వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, మూడు మాసాల బంగారం చోరి జరిగింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన విజయలక్ష్మీ తన భర్త ,కూతురుతో హైదరాబాద్ వెళ్లేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డి బస్సు ఎక్కారు. బస్సు నందికంది వద్దకు చేరుకోగానే విజయలక్ష్మి టిక్కెట్ తీసుకునేందుకు చిల్లర కోసం […]
సామాజిక సారథి, తల్లాడ: రోడ్డు మరమ్మతుల్లో భాగంగా ప్రమాద నివారణ చర్యలు లోపించి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నుంచి శనివారం రాత్రి మియాపూర్ కు బయల్దేరిన కొత్తగూడెం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు మార్గమధ్యలో తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద గుంతలు […]
సారథి, అచ్చంపేట: అధికారుల వేధింపుల కారణంగానే ఆర్టీసీ రాణిగంజ్ డిపో–1 డ్రైవర్ తిరుపతి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్చేస్తూ నాగర్కర్నూల్జిల్లా అచ్చంపేట ఆర్టీసీ డిపో ఎదుట యూనియన్ నాయకులు, ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. అధికారుల వేధింపులతో తిరుపతిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. వేధింపులకు పాల్పడిన అధికారులపైనా తగిన చర్య తీసుకోవాలని, వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీ బస్టాప్లో ఆర్టీసీ కార్గో పార్సిల్ పాయింట్ ను హయత్నగర్డీవీఎం విజయభాను మంగళవారం ప్రారంభించారు. ఆర్టీసీ కార్గో పార్సిల్సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మిధాని డిపో మేనేజర్ టి.కిషన్ రావు, సీఐ నమ్రత, మిధాని డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ టీం బి.నాగరాజు, కె.రాములు తదితరులు పాల్గొన్నారు.
కడప: కడప- బెంగళూరు మధ్య ఆదివారం నడిచే బస్సు సర్వీసులు ఇక నుంచి నిలిపివేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 12, 19, 26 తేదీల్లో ఆ రూటులో బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆయా తేదీల్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి నగదు డబ్బులు రిటన్ చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తి ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఆదివారం బెంగళూరులో పూర్తి లాక్డౌన్ ఉన్నందున రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మిగతా రోజుల్లో […]