Breaking News

ప్రజలకు చేరువగా పోలీసింగ్ వ్యవస్థ

ప్రజలకు చేరువగా పోలీసింగ్ వ్యవస్థ:
  • – డీఐజీ ఏవీ రంగనాథ్
  • – గ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ

 సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ప్రజలకు పోలీస్ శాఖను ప్రజలకు చేరువ చేసి, ప్రజాసమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జిదారులతో నేరుగా మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. ఓ బాధితుడు తన భూసమస్యను తెలియజేసేందుకు అంబులెన్స్ లో జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిడు. నడవలేని స్థితిలోనున్న ఆ వ్యక్తి దగ్గరికే నేరుగా వెళ్లి సమస్యను తెలుసుకుని, సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. సంబంధిత ఫిర్యాదులపై వేగంగా స్పందించి పోలీసు సేవలు త్వరితగతన సేవలందించాలని ఆదేశించారు.  ప్రజల ఫిర్యాదులను స్వీకరించడానికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక విభాగం పని చేయడమే కాకుండా ఫిర్యాదును ఆన్ లైన్ లో నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.