Breaking News

నానమ్మకు, నాన్నకు చోటివ్వలే..

నానమ్మకు, నాన్నకు చోటివ్వలే..

సారథి, వేములవాడ: మానవత్వానికి మచ్చ తెచ్చిన ఓ ఘటన ఆదివారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సాయినగర్ లో చోటుచేసుకుంది. నానమ్మ, నాన్నను ఓ మనవరాలు ఇంట్లోకి రావొద్దని గెంటివేసింది. బాధితుల కథనం మేరకు.. సాయినగర్ కు చెందిన వెంకటస్వామికి నలుగురు కూతుళ్లు ఉన్నారు. తన ఆస్తిని పెద్ద కూతురుకు రాసిచ్చాడు. వెంకటస్వామి భార్య, శతాధిక వృద్ధురాలైన తల్లితో కలిసి కొంతకాలంగా ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. అతని తల్లి అనారోగ్యానికి గురికావడంతో ఓనర్ ఇంటిని ఖాళీచేయమన్నాడు. దీంతో ఎటు వెళ్లాలో తెలియకపోవడంతో వెంకటస్వామి తన పెద్దకూతురు వద్దకు వెళ్లాడు. తమకు కాసింత చోటు ఇవ్వమని అడిగాడు. కరోనా నేపథ్యంలో ఇంట్లోకి వారిని రానివ్వకుండా రోడ్డుపై ఓ టెంటు వేసి అందులో ఉంచింది. వారు అక్కడే సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మాతృదినోత్సవం రోజున నానమ్మకు, నాన్నకు మనవరాలితో జరిగిన అవమానంపై సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తంచేశారు.