Breaking News

రామాలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ

రామాలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ

సారథి న్యూస్, మెదక్: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి హిందువులే కాదు ముస్లింలు సైతం విరాళాలు అందిస్తున్నారు. ఆదివారం మండల కేంద్రమైన కొల్చారం గ్రామంలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన సుమారు 20 మంది ముస్లింలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమవంతు విరాళాలు అందజేయడం విశేషం. కార్యక్రమంలో ముస్లిం నాయకులు మహమ్మద్, అక్రం, ఖదీర్, ఇసాక్, మహమ్మద్ సమీర్, మౌలానా, హర్షద్, అహమ్మద్, ఇమ్రాన్, రామమందిర నిర్మాణ తీర్థ ట్రస్ట్ బాధ్యులు జూలకంటి సంగమేశ్వర్, ఎంపీటీసీ అరుణ కృష్ణగౌడ్, మాజీ సర్పంచ్ సునీతా ప్రభాకర్, రాజేందర్ గౌడ్, పాల్వంచ దుర్గా ప్రసాద్ గౌడ్, రఘుకుమార్, సాయి కుమార్, భూమేష్, హరీశ్​, సంపత్ కుమార్, భాస్కర్, శ్రీకాంత్, సాకేత్, విక్కీ, మల్లేశం, సృజన, శివాక్రాంతి పాల్గొన్నారు.
దాతల విరాళాలు ఇవే..
రామమందిరం నిర్మాణానికి బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పాల్వంచ కార్తీక విజయ్ రూ.25,211, అరుగొండ మురళీధర్, శ్రీధర్ రూ.10,116 అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవహ ఓంకార్ యాదవ్, వరిగుంత గ్రామం నుంచి జడ్పీటీసీ మేఘమాల సంతోష్, రిటైర్డ్​ టీచర్​ ప్రభులింగం రూ.10,116 చొప్పున విరాళాలు ఇచ్చారు.