సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 17న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలను ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అధిశ్రావణ యాగం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న ఈ యాగానికి ప్రతిఒక్కరూ ఆహ్వానితులేనని స్పష్టంచేశారు. యాగానికి పదివేల మంది హాజరవుతున్నట్లు అంచనా వేస్తున్నామని వెల్లడించారు. యాగానికి హాజరయ్యే భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదం అందజేసి.. అన్నదానం చేయనున్నట్లు తెలిపారు.
- February 2, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- Ascetic sacrifice
- CM KCR
- lb stdium
- sportauthority
- TELANGANA
- అధిశ్రావణ యాగం
- క్రీడా ప్రాధికార సంస్థ
- సీఎం కేసీఆర్
- Comments Off on సీఎం కేసీఆర్ పుట్టినరోజు అధిశ్రావణ యాగం