సామాజిక సారథి, వనపర్తి బ్యూరో:మదనాపురం మండలం నర్సింగాపురం గ్రామ సర్పంచ్ బక్షి భాగ్యలక్ష్మమ్మ( 80) సోమవారం మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె సోమవారం ఉదయం మరణించారు. గ్రామాభివృద్దిలో రాజీపడకుండా పాలన కొనసాగించినసర్పంచ్ భాగ్య లక్ష్మమ్మ మృతి చెందడం పై గ్రామస్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు.పలువురి పరామర్శ…నరసింగాపురం సర్పంచ్ బక్షి భాగ్యలక్ష్మమ్మ మృతి చెందిన సమాచారం తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అడ్వకేట్లు, రెవెన్యూ ఉద్యోగులు, జర్నలిస్టులు […]