దేశానికి మోడీ, రాష్ట్రానికి కేసీఆర్ప్రమాదకరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజం ఘనంగా కాంగ్రెస్పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సామాజికసారథి, హైదరాబాద్: దేశానికి కాంగ్రెస్పార్టీ దిశానిర్దేశం చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శాంతియుత పోరాటంతో ఏదైనా సాధించవచ్చనని స్వాతంత్య్ర సంగ్రామం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిందని కొనియాడారు. అలీన విధానం, హరితవిప్లవం, పారిశ్రామిక విప్లవం, ఫుడ్ సెక్యురిటీ సిస్టం, ఉపాధిహామీ పథకం, సాంకేతిక అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమైందన్నారు. మంగళవారం గాంధీభవన్లో 137వ పార్టీ ఆవిర్భావ […]
ఒవైసీ జంక్షన్ వద్ద రూ.80 కోట్లతో నిర్మాణం లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కేటీఆర్ సామాజికసారథి, హైదరాబాద్: నగరంలోని సంతోష్ నగర్ ఒవైసీ జంక్షన్ వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏపీజే అబ్దుల కలామ్ఫ్లై ఓవర్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. మూడు లైన్లలో 12 మీటర్ల వెడల్పుతో వన్ వే మార్గంగా […]
ప్రపంచ వ్యాప్తంగా పంటకు డిమాండ్ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ హైటెక్స్ రెండు రోజుల పాటు జాతీయ సదస్సు సామాజికసారథి, హైదరాబాద్: ఆయిల్పామ్ సాగుతో మంచి లాభాలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా దీనికి డిమాండ్ ఉందన్నారు. సాగుచేసే రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందన్నారు. పరిశ్రమ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై హైదరాబాద్లోని హైటెక్స్లో మంగళవారం జాతీయ సదస్సు జరిగింది. సదస్సు సహా […]
కాంగ్రెస్ అదే కోరుకుంటోంది రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా జరపాలని కాంగ్రెస్ కోరుకుంటోందని రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. ఎన్నికలను వాయిదా వేయాలా? వద్దా? అనే అంశంపై రాజకీయవర్గాల్లో తాజాగా జరుగుతున్న చర్చపై మంగళవారం ఆయన స్పందించారు. ఎన్నికలు జరపాలన్న వాదనకు మద్దతిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్సమావేశాలకు కూడా హాజరుకాకుండా స్వయంగా ర్యాలీల్లో పాల్గొంటూ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ పోతుంటే ఎన్నికలను మాత్రం […]
ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో అప్రమత్తం నైట్ కర్ఫ్యూతో పాటు మరిన్ని ఆంక్షలు న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండటంతో మరిన్ని ఆంక్షలకు సర్కార్ దిగింది. వైరస్ మరింత విస్తరించకుండా ఢిల్లీ సర్కార్ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. వరుసగా రెండు రోజులుగా కొవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతానికిపైగానే ఉంటుంది. దీంతో ఎల్లో అలర్ట్ ప్రణాళికను అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం అరవింద్ కేజీవ్రాల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆదేశాలను త్వరలోనే విడుదల […]
చైనా వ్యవహారాల్లో ఆరితేరిన మిస్రీ న్యూఢిల్లీ: చైనా వ్యవహారాల నిపుణుడైన విక్రమ్ మిస్రీ జాతీయ భద్రతా ఉపసలహాదారుగా నియమితులయ్యారు. చైనా వ్యవహారాల్లో ఆరితేరిన విక్రమ్.. బీజింగ్ లో భారత రాయబారిగా పనిచేశారు. 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన.. డిప్యూటీ ఎన్ఎస్ఏగా ఉన్న పంకజ్ సరణ్ నుంచి ఈనెల 31న బాధ్యతలను స్వీకరించనున్నారు. చైనాతో పాటు రష్యాలో కూడా భారత రాయబారిగా పనిచేసిన అనుభవం విక్రమ్కు ఉంది. అయితే ఎన్ఎస్సీఎస్ లో ఆయన చేరడంతో చైనా […]
ఐఐటీ కాన్పూర్ స్నాతకోత్సవంలో విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోడీ కాన్పూర్ మెట్రోను ప్రారంభించి.. ప్రయాణించిన మోడీ, ఆదిత్యనాథ్ లక్నో: ప్రస్తుత పరిస్థితుల్లో నింపాదిగా ఉండాలని కోరుకోవడానికి బదులుగా సవాళ్లను ఎంచుకోవాలని విద్యార్థులకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఇప్పుడు కొత్తవాటి గురించి భయం అనేదే లేదన్నారు. యావత్ప్రపంచాన్ని తెలుసుకునే సత్తా విద్యార్థులకు ఉందన్నారు. ‘ఫలానా విషయం తెలియదు’ అనే ప్రశ్నే ఇక లేదని, అత్యుత్తమమైనదాని కోసం అన్వేషణ, యావత్ప్రపంచాన్ని జయించాలనే కల ఉన్నాయని చెప్పారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ […]
కల్తీకల్లు తాగి 10 మందికి అస్వస్థత గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు మెదక్జిల్లా కొంతాన్ పల్లిలో కలకలం సామాజికసారథి, మెదక్ ప్రతినిధి: కల్తీ కల్లు తాగి 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్పల్లిలో కలకలం రేపింది. గ్రామంలోని ఓ దుకాణంలో కల్లు తాగిన కుల్ల నాగరాజు, బ్యాగరి మనీలా, మడూరి రమేష్, వీరబోయిన స్వామి, తుమ్మల స్వామి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే వీరంతా […]