సామజిక సారథి, వాజేడు: 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సినేషన్ను వేయించుకోవాలని వైద్యాధికారి డాక్టర్ యమున తెలిపారు. మంగళవారం వాజేడు మండలంలో కరోనా టీకా మానవాళికి రక్షణ అని వాజేడు వైద్య సిబ్బంది రైతుల వద్దకు వెళ్లి పంట పొలాల్లో కూడా టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్ ఈశ్వరమ్మ. వైద్య సిబ్బంది శేఖర్. ఛాయాదేవి,ఆశ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు
జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని పాలెం వ్యవసాయ కళాశాలలో టైర్- 3 శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పబ్లిక్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ద్వారా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సదరన్ రీజియన్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం యొక్క అక్విఫర్ మ్యాప్లు, నిర్వహణ ప్రణాళికలను జిల్లా పరిపాలనకు అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని […]
యాక్సిండెంట్కు సంబంధించి వివరాలు కోరిన పోలీసులు సామాజికసారథి, హైదరాబాద్: సినీ హీరోసాయి ధరమ్ తేజ్ గత సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని ఐకియా స్టోర్ వద్ద బైక్ స్కిడ్ కావడంతో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్తేజ్.. ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి మళ్లీ సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తేజ్ యాక్సిడెంట్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సాయి ధరమ్తేజ్పై ఛార్జ్ […]
గంగాజమున సంస్కృతిని రూపుమాపే కుట్ర కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో అపశ్రుతి న్యూఢిల్లీ: దేశంలోని గంగాజమున సంస్కృతిని రూపుమాపే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. అందరిలోనూ భయం ఉన్నదని, సాధారణ పౌరుడు అభద్రతా భావంలో ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పక్కదారి పట్టిస్తున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మౌనంగా ఉండబోదని హెచ్చరించారు. మంగళవారం కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా […]
సామాజికసారథి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బార్లు, వైన్ షాపులకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. డిసెంబర్ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. డిసెంబర్ 31న వైన్ షాపులు సైతం అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంటాయని చెప్పింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. అయితే కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని […]
సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోకపోతే మరో విద్యుత్ పోరాటానికి సిద్ధమవుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన విద్యుత్ పోరాట ప్రభావంతో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు సాహసించలేదని, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు […]
కేంద్రమార్గదర్శకాల మేరకు ఏర్పాట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు సామాజికసారథి, హైదరాబాద్: జనవరిలో బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు ప్రకటించారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పిల్లలు, 60ఏళ్ల పైబడిన వారికి ఇస్తామన్నారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ పేదలకు ఉచితంగా వైద్యం అందించే లక్ష్యంతో జీహెచ్ఎంసీలో ప్రారంభించిన బస్తీ దవాఖానాలు సక్సెక్స్ అయ్యాయి. దీంతో వాటిని ఇతర పట్టణాలకు విస్తరించేందుకు సర్కారు సిద్ధమైంది. […]
సామాజిక సారథి, వరంగల్: వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చి ధర మంగళవారం పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రూ.18వేలు పలికిన వండర్ హాట్ మంగళవారం రూ.18500, 341 రకం 17500, తేజ రకం రూ.15400 ఉన్నట్టు అధికారులు తెలిపారు. మార్కెట్లో పత్తికూడా రికార్డు ధర పలికింది. రూ.8715 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. సీజన్ లో పత్తి ధర ఈ విధంగా పలకడం ఇదే మొదటిసారి కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు