Breaking News

Month: December 2021

స్థానిక సంస్థల్లో కారే దూసుకెళ్లింది

స్థానిక సంస్థల్లో కారే దూసుకెళ్లింది

టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి ఘన విజయం  సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ఎమ్మెల్సీ ఎన్నికలో రేసులో అంతా అనుకున్నట్లే కారే గెలిచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి ఘన విజయం సాధించారు. నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నిక అనంతరం మహిళా సమాఖ్య భవన్ లో మంగళవారం  కౌంటింగ్ ఉదయం నిర్వహించారు.  ఏడుగురు అభ్యర్థు పోటీ పడిన ఈ ఎన్నికల్లో 1271 ఓట్లుకుగాను, 1233 ఓట్లు పోలయ్యాయి. కాగా, కౌంటింగ్ లో ఎంసీ కోటిరెడ్డికి […]

Read More
వికలాంగుడి ఆత్మహత్య యత్నం

వికలాంగుడి ఆత్మహత్య యత్నం

సామాజిక సారథి, వరంగల్:  తన భూమిలో అక్రమంగా బోరు వేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని వికలాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వరంగల్ నగర పరిధిలోని కాశిబుగ్గ  ప్రాంతానికి చెందిన వికలాంగుడైన సయ్యద్ అసద్ కి సంబంధించిన భూమిపై కోర్టు ఇచ్చిన తీర్పు జడ్జ్ మెంట్ ను కూడా  తప్పుదోవ పట్టి తన భూమిలో అక్రమంగా బోరు వేశారని అసద్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమార్కులు మమ్మల్ని ఎవరు […]

Read More
బ్యాంక్ సిబ్బంది సమ్మెను విజయవంతం చేయాలి

బ్యాంక్ సిబ్బంది సమ్మెను విజయవంతం చేయాలి

సామాజిక సారథి, దేవరకొండ:  యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ 9 ట్రేడ్ యూనియన్స్ తో చేపట్టిన రెండు రోజుల సమ్మె ను విజయవంతం చేయాలని  కామ్రేడ్స్ అన్నారు. మంగళవారం  స్థానిక దేవరకొండ ఎస్బీఐ ముందు డివిజన్ పరిధిలో ఉన్న అన్ని బ్యాంకుల సిబ్బంది, విద్యార్థి సంఘం నాయకులు కలసి రెండు రోజుల సమ్మె ను విజయవంతం చేయాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ మాలోతు రమేష్,  సిబ్బంది బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ […]

Read More
నైతికంగా గెలిచాం: భట్టి

నైతికంగా గెలిచాం: భట్టి

సామాజికసారథి, ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికల్లో అతికష్టం మీద టీఆర్‌ఎస్‌ బయటపడి గెలిచిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలో నైతికంగా కాంగ్రెస్‌ గెలిచిందన్నారు. కేవలం 96 ఓట్లు ఉన్న కాంగ్రెస్‌కు 242 ఓట్లు రావడమే అందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌  అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్‌ లేదన్న అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించామని అన్నారు.

Read More
ఏసీబీకి చిక్కిన ఎన్ఆర్ఈజీ స్ టెక్నీకల్ అసిస్టెంట్

ఏసీబీకి చిక్కిన ఎన్ఆర్ఈజీస్ టెక్నీకల్ అసిస్టెంట్

 సామాజిక సారథి, ధర్మసాగర్:  హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో  ఎన్ ఆర్ ఈ జీ ఎస్  టెక్నీకల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న యాదగిరి  రైతు లింగయ్య దగ్గర రూ. 10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. మజ్జిగ లింగయ్య ఎన్ ఆర్ ఈ జీ ఎస్ కింద నువ్వుల పంట  మెయింటైన్ బిల్లు మంజూరు కోసం యాదగిరిని ఆశ్రయించగా లింగయ్య దగ్గర రూ. 10 వేలు లంచం […]

Read More
యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన

యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన

సామాజికసారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి లక్ష్మీనృసింహుడి సన్ని ధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో దివ్యమనోహరంగా అలంకరించి ఆచార్యులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. అర్చకబృందం, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాలపూలతో లక్షపుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించారు. పాంచ రాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు గంటకు పైగా లక్షపుష్పార్చన పూజ పర్వాలు కొనసాగాయి. విశేష వేడుకులను […]

Read More
వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం

వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం

  • December 15, 2021
  • Comments Off on వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం

పార్లమెంట్​లో లేవనెత్తుతాం: ఎంపీ ఉత్తమ్​ రాహుల్‌ మద్దతు ఇచ్చారన్న మధుయాష్కీ వర్గీకరణ చేయకపోతే బీజేపీ తిరగనియ్యం ఎస్ఎఫ్ ​సదస్సులో మందకృష్ణ మాదిగ న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్‌ ఎప్పుడు వెనకడుగు వేయలేదన్నారు. వర్గీకరణ కోసం తన జీవితాన్ని మందకృష్ణ మాదిగ అంకితం […]

Read More
ఉస్మానియాలో 50 పడకల ఐసీయూ

ఉస్మానియాలో 50 పడకల ఐసీయూ

  • December 15, 2021
  • Comments Off on ఉస్మానియాలో 50 పడకల ఐసీయూ

క్యాథ్‌ ల్యాబ్‌, సీటీ స్కాన్‌ సేవలను ప్రారంభించిన మంత్రి హరీశ్​రావు సామాజికసారథి, హైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రిలో 50 పడకల ఐసీయూ నిర్మాణంలో ఉందని, దీన్ని రెండు నెలల్లోనే ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అలాగే టెస్టులను వెంటనే ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో సీటీ స్కాన్‌, క్యాథ్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.ఏడుకోట్లతో క్యాథ్‌ ల్యాబ్‌, రూ.రెండుకోట్ల 12 లక్షలతో సీటీ స్కాన్‌ను […]

Read More